AP Mega DSC 16347 Posts Notification Released | మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Written by Eswar Online Solutions

Published on:

AP Mega DSC 16347 Posts Notification Released | మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP Mega DSC 16347 Posts Notification Released | మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణ వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది.

          మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా ఆదివారం (ఏప్రిల్ 20) ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమైనాయి. కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 45 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న విద్యాశాఖ మే 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఫీజు కింద రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజుల చెల్లింపులు కూడా మే 15 వరకు అవకాశం ఉంటుంది. అయితే గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఫీజు చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే వారు దరఖాస్తు ఫీజు చెల్లించనవససరం లేదు. అదనంగా ఇతర సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి. అనంతరం మే 30 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

        ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌ 1గా ఇంగ్లిష్‌ భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మార్కులు లెక్కిస్తారు. ఇక ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్‌ వెయిటేజీ 20 శాతం వర్తిస్తుంది.

ఇక జూన్‌ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో మెగా డీఎస్సీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 20వ తేదీ నుంచి డీఎస్సీ అభ్యర్ధులకు మాక్‌ టెస్ట్‌లు సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఏ సబ్జెక్టు పరీక్ష పూర్తయినప్పటికీ ఆ మరుసటి రెండో రోజే ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత పరీక్షలు ముగిసిన వారం రోజులకే మెగా డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

1. మన వెబ్‌సైట్ www.eswaronlinesolutions.com ని  సందర్శించండి.

2. క్రింద బాగంలో Whatsapp Symbol  కనిపిస్తున్న నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.

3. Whatsapp ఓపెన్ అయ్యాక Hi అని ఒక మెసేజ్ పంపండి వెంటనే సమాధానం వస్తుంది

4. అవసరమైన డాక్యుమెంట్లను పంపించి ఫీజు చెల్లించండి.

5. దరఖాస్తును సమర్పించాక మీకు మీ అప్లికేషన్ pdf లో పంపించబడుతుంది  భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింట్ తీసుకోండి.

NOTE: ఖచ్చితమైన వివరాలు మరియు తాజా అప్‌డేట్స్ కోసం మన వెబ్సైట్ ను  చూడండి. ఏదైనా సందేహాలు ఉంటే, మన Whatsapp Grouplo సంప్రదించవచ్చు.

Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Apply Online (Available)Click Here
AP DSC Official NotificationClick Here
DSC Official WebsiteClick here
Our WebsiteClick here
Join Telegram ChannelClick Here
Join WhatsApp GroupClick Here
Join Instagram LinkClick Here

 

Our Website

Our Whatsapp Group Link

Join Telegram Channel

Join Instagram Link

1 thought on “AP Mega DSC 16347 Posts Notification Released | మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment